ఓం స్థల పురాణం ----------------------------- పూర్వము విశ్వామిత్ర మహర్షి చేయుచున్న యజ్ఞ యాగములను భంగము చేయుచున్న రాక్షసులను సంహరించుటకై దశరథ పుత్రులైన రామలక్ష్మణులను వెంట తీసుకొచ్చి తాటకి మొదలగు రాక్షసులను నిర్మూలము గావించి తదుపరి ఇక్కడే శ్రీరంగనాథ స్వామి విగ్రహ ప్రతిష్ట చేశాడని ప్రతీతి కావున సాక్షాత్ బ్రహ్మర్షి అయిన విశ్వామిత్ర మహర్షి చేత ప్రతిష్టించ బడిన స్వామి కాబట్టి అంతటి గొప్ప మహిమాన్వితమై శ్రీ దేవి భూదేవి సమేత దివ్య తేజో మూర్తిగా విరాజిల్లుచూ ఎల్ల జగాలను స్వామి వారు పడుకొనే పాలించు చున్న ఏకైక మోక్షాధి పతి శ్రీ రంగనాథ స్వామి మరియు జగన్నాటక రంగస్థలానికి నాయకుడైన శ్రీ రంగనాథ స్వామిని అశ్రయించుట చేత దుఃఖశమనం, సంచిత పాప వినాశనము, అకాలమృత్యు ఆపదలు తొలగి సంఘంలో గౌరవ కీర్తి ప్రతిష్టలతో, స్వామి వారి మీద, పెద్దల మీద, గురువుల యందు, భక్తి ప్రపత్తులు పెరిగి నిత్య కళ్యాణం పచ్చ తోరణములా సకల సంతోషములతో సకుటుంబ సమేతంగా వంశాభి వృద్ది చెంది చిట్ట చివర కైవల్య ధామం చేరుదురు. ప్రస్తుత ఆలయ నిర్మాణం ----------------...
Comments
Post a Comment