మాతృకా పంచకం
🌷 ఆదిశంకరుల మాతృ పంచకం 🌷 కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. 1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి రాజేతి జీవేతి చిరం సుతత్వం ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః దదామ్యహం తండులమేవ శుష్కం. తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు. 2 . అంబేతి తాతేతి శివేతి తస్మిన్ ప్రసూతి కాలే యాదవోచ వుచ్యైః కృష్ణేతి గోవింద హరే ముకుందే త్యహో జననై రచితోయమంజలి. తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. 3 ....