Posts

మాతృకా పంచకం

🌷  ఆదిశంకరుల మాతృ పంచకం 🌷 కాలడి లో ఆది శంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై వుంది. తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఉత్తరక్రియలు చేశారు. ఆ సందర్భం లో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి. 1 .ముక్తామణిస్త్వం నయనం మమేతి      రాజేతి జీవేతి చిరం సుతత్వం      ఇత్యుక్తవత్యా స్తవవాచి మాతః      దదామ్యహం తండులమేవ శుష్కం. తా:--అమ్మా! నీవు నా ముత్యానివిరా! నా రత్నానివిరా! నా కంటి వెలుగువురా నాన్నా! నువ్వు చిరంజీవిగా వుండాలి. అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం  యిన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నాను. నన్ను క్షమించు. 2 .   అంబేతి తాతేతి శివేతి తస్మిన్        ప్రసూతి కాలే యాదవోచ వుచ్యైః        కృష్ణేతి గోవింద హరే  ముకుందే        త్యహో జననై రచితోయమంజలి. తా:--పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే బాధను ఆపుకోలేని బాధను "అమ్మా! అయ్యా! శివా! కృష్ణా! హరా! గోవిందా!" అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. 3 ....

దక్షిణా మూర్తి అష్టకం శంకరాచార్య కృతం

“మాయను ఛేదించే మహా జ్ఞానం – శ్రీ దక్షిణామూర్తి మహిమ” “అద్దంలా కనిపించే జగత్తు వెనుక నిజం – దక్షిణామూర్తి తత్త్వం” “ఆత్మనే బ్రహ్మం – గురు దక్షిణామూర్తి ఉపదేశం” “సంసారాంధకారాన్ని తొలగించే జ్ఞాన సూర్యుడు” “నిజం తెలుసుకునే మార్గం – దక్షిణామూర్తి అష్టకం తాత్పర్యం” శ్రీ ఆది శంకరాచార్య విరచిత  శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము: 1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురు మూర్తయే  నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!! ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు. 2.బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః  మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా తస్...

ముకుంద మల

శ్రీవల్లభేతి వరదేతిదయాపరేతి భక్తప్రియేతి భవలుణ్ఠన కోవిదేతి! నాథేతి నాగాశయనేతి జగన్నివాసే త్యాలాపనం ప్రతిపదం కురు మే ముకున్ద!! 1 ఓ శ్రీ కృష్ణా! శ్రీ వల్లభా!వరదా!దయాపరా!భక్తప్రియా!భవ బంధాలను త్రెంపివైచే కోవిదుడా!నాథా!నాగశయనా!జగన్నివాసా!ఎల్లప్పుడూ నీ నామాలను ఆలపించేటట్లుగా చేయి స్వామీ! జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప: జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో జయతు జయతు పృధ్వీభారనాశో ముకుంద: దేవకీ కుమారుడైన దేవదేవుని కి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగుగాక! మేఘశ్యామలుడు,కోమలాంగుడూ అయిన కృష్ణ భగవాను నికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడా నికి అవతరించిన ముకుందు నికి జయము జయము! ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియం తమర్ధం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవేభవే మేస్తుభవత్ప్రసాదాత్ -ముకుందమాల స్తోత్రం 3 (శ్రీకులశేఖర మహారాజు – మొదటి శ్లోకంలో కృష్ణుని పిలిచి, రెండో శ్లోకంలో ఎదుట నిలచిన కృష్ణునకు జయము పలికిరి. ఈ శ్లోకం నుండి శ్రీకులశేఖరులు స్తోత్రము చేయుచున్నారు. ఈ శ్లోకం “ముకుంద”తో ప్రారంభమగుట వలన “ముకుందమాల” అను పేరు ఈ స్తోత్రమునకు వచ్చినది. ఇందులో...

ఇయర్ పగనాయర్ చరిత్ర

🚩 లోక ధర్మాన్నే ఎదిరించిన అపర భక్తుడు: ఇయర్ పగై నాయనారు చరిత్ర 🚩 నాయనార్ల జీవిత చరిత్ర - 3 వ భాగం శివునిపై అచంచలమైన భక్తికి, త్యాగానికి నిలువుటద్దం 63 మంది నాయనార్లు.వారి భక్తి మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే - శివసాయుజ్యం. ఆ అరవై ముగ్గురిలో, సామాన్య మానవ మాత్రులు ఊహించడానికి కూడా సాహసించని కఠినమైన పరీక్షను ఎదుర్కొని, భక్తి కోసం లోక నిందను సైతం భరించిన మహనీయుడు "ఇయర్ పగై నాయనారు". 🌼 జననం మరియు కఠిన వ్రతం: తమిళనాడులోని ప్రముఖ వాణిజ్య నగరమైన 'కావేరిపూంపట్టినం' (పూంపుహార్) లో ఒక సంపన్న వైశ్య కుటుంబంలో ఈయన జన్మించారు. ఆయన అసలు పేరు చరిత్రలో మరుగున పడినా, ఆయన చేసిన కార్యమే ఆయన పేరుగా మారింది. ఆయనకు శివుడంటే అమితమైన భక్తి. శివ భక్తులు (శివనడియార్లు) ఇంటికి వస్తే సాక్షాత్తు శివుడే వచ్చినట్లు భావించేవారు. ఆయన జీవితంలో ఒక కఠినమైన వ్రతాన్ని చేపట్టారు. "శివ చిహ్నాలు ధరించిన భక్తులు ఎవరు వచ్చి, ఏమి అడిగినా 'లేదు' అనకుండా ఇవ్వాలి" - ఇదే ఆ వ్రతం. తన ఆస్తిపాస్తులను భక్తుల కోసమే ఖర్చు చేసేవాడు. 🔥 పరమేశ్వరుని విచిత్ర పరీక్ష: ఇయర్ పగై భక్తిలోని లోతును, ఆయన త్యాగనిరతి...

ఆశ్రమం చౌ డమ్మ పాన్ ఫే no

670849

మూర్ఖ నాయనార్

మూర్ఖ నాయనార్ విశేష చరిత్ర - అంతరార్థం. చరిత్ర: తొండైనాడు (తమిళనాడు) లోని తిరువేర్కాడు అనే గ్రామంలో జన్మించిన మహానుభావుడు  మూర్ఖ నాయనార్. ఆయన జీవితంలో ఒకే ఒక్క వ్రతం పెట్టుకున్నాడు ప్రతిరోజూ కనీసం ఒక్క శివ భక్తుడికైనా క డుపునిండా అన్నం పెట్టిన తర్వాతే తాను భోజనం చేయాలి అని. ఆయన ఇంట్లో నిరంతరం శివ పూజలు, శివ భక్తులైన సాధువులకు అన్నదానాలు జరిగేవి. దీనివల్ల కొన్నేళ్లకు ఆయన ఆస్తిపాస్తులు, సంపద అంతా కరిగిపోయింది. రోజు గడవడం కూడా కష్టమైంది. కానీ, తన వ్రతాన్ని ఆపడానికి ఆయన మనసు ఒప్పలేదు. శివ భక్తులైన సాధువులు ఆకలితో ఉండటం ఆయన చూడలేకపోయాడు. ఆ సమయంలో ఆయనకు డబ్బు సంపాదించే వేరే మార్గం కనిపించక, ఈ క్రమంలో ఒక ఆలోచన తట్టింది జూదంలో మంచి దిట్ట అయినందున తనకున్న ప్రావీణ్యంతో జూదం (ద్యూతం) ఆడటం మొదలుపెట్టాడు.  జూదం ఆడటం సమాజ దృష్టిలో వ్యసనమే. కానీ, ఆయన జూదంలో గెలిచిన ప్రతి పైసాను శివ భక్తులకు అన్నం పెట్టడానికే ఉపయోగించాడు. ఒకవేళ ఎవరైనా జూదంలో మోసం చేయాలని చూసినా, గెలిచినా డబ్బు ఇవ్వకుండా పారిపోవాలని చూసినా వారి మీద తిరగబడి తన చురకత్తి తీసి వాళ్ళను వెంబడించి, భయపెట్టి మరీ ఆ డబ్బు వసూలు చేసేవాడు...

గృహ ప్రవేశానికి ముహూర్తం

గృహ‌ప్ర‌వేశం ఎలా.... ఏదీ మంచి ముహూర్తం.................!! గృహ‌ము నిర్మాణం అయిన త‌ర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ గృహ ప్రవేశం. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, గోవుతో ముందుగా ఇల్లు తొక్కించడం, బంధువులకు, స్నేహితులకు విందు మొదలైనవి ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్యమైనవి. అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విష‌యం చాలా ముఖ్యం. సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్ప‌వ‌చ్చు. అయితే కార్తీక, మృగశిర మాసాలు మధ్యమ ఫలప్రదాలు. నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది. రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియ శుభమ‌ని శాస్త్రం చెబుతోంది. దక్షిణ సింహద్వారం ఉన్న గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు శుభ‌క‌ర‌మైన‌వి. ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికి రాదు. దక్షిణ సింహద్వారం ఉన్న ఇంటికి.. గృహ ప్ర...