వివేకానంద జయంతి

ఆ కళ్ళలో కనిపించేదంతా కరణారసం 
ఆ హుందాతనంలో ఉన్నదంతా దేశభక్తి
ఆయనొక అద్భుత శక్తి ధైర్యానికి చిరునామా
అజాగ్రత్తకు అలసత్వానికి చోటుండని 
వ్యక్తిత్వంగల అగ్ని శిఖ ఆయన
నిరంతర సత్యశోధనే ఆయన లక్ష్యం
ప్రతిమనిషి శక్తి వంతుడే తప్ప శక్తి హీనుడు కాడు 
అన్నదే ఆయన నినాదం మరుగున నిద్ర పోతున్న
శక్తిని మేలుకొలుపుమని యువతకు ఇచ్చిన మెరుపు
 తీగల్లాంటి దివ్య సందేశం ఆయనది.
భారతదేశ సనాతన ధర్మ నిధిని విదేశాలకు
పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి స్వామి 
వివేకానంద అట్టి మహానుభావుని మనసా 
వాచా కర్మణా స్మరిస్తూ 

యలిగండ్ల నాగరంగయ్య.

Comments